Childhood Pic: టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న క్రేజీ హీరోయిన్…ఎవరో తెలుసా.!

Childhood Pic

Childhood Pic: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్ లు కొంత మంది ఒకప్పుడు మిస్ ఇండియా,మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొన్న వాళ్లే.అలా అందాల పోటీలలో పాల్గొని క్రేజ్ సంపాదించుకున్న వాళ్లలో ఐశ్వర్య రాయి,సుస్మిత సేన్,లారా దత్తా ఉన్నారు.అయితే కొంత మంది అమ్మాయిలు విన్నర్స్ కాకపోయినా అందాల పోటీలలో పాల్గొని ఆ తర్వాత హీరోయిన్ గా రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు.ప్రస్తుతం ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకప్పుడు మిస్ ఇండియా పోటీలలో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచింది.

ఈమె టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది.ఈ పై ఫొటోలో అబ్బాయిలాగా కనిపిస్తున్నా ఈ చిన్నది టాలీవుడ్ లో ఒక్క సినిమాతో క్రేజ్ ను సంపాదించుకుంది.

టాలీవుడ్ లో హీరో అడవి శేష్ కు జోడిగా నటించి ఊరికే ఊరికే మనసే ఊరికే అంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఈ బ్యూటీ ఎవరో కాదు తాజాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా లో హీరో మహేష్ బాబు తో ఆడి పాడిన మీనాక్షి చౌదరి.ఈమె 2018 లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచింది.

ఆ తర్వాత హిందీ లో ఒక సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది మీనాక్షి.వాహనాలు నిలుపరాదు అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.అడవి శేష్ కు జోడిగా నటించిన హిట్ సినిమాతో మీనాక్షి కి మంచి గుర్తింపు లభించింది.ప్రస్తుతం నాలుగు అయిదు సినిమాలతో బిజీ గా ఉంది మీనాక్షి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *